జూన్ 12 నుంచి గుంటూరు కారం

61
- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందట. ఈ షెడ్యూల్ లో మహేష్ – పూజా హెగ్డేల పై కొన్ని రొమాంటిక్ సీన్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్.

ఇక మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా మీదకు వెళ్లాల్సి ఉంది. అందుకే, ఎట్టిపరిస్థితుల్లో త్రివిక్రమ్ ఈ సినిమాని చాలా వేగంగా పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాడు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రానున్న ఈ సినిమా పూర్తి ఢిల్లీ నేపథ్యంలో సాగనుంది. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు.

రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది.

- Advertisement -