ఎన్టీఆర్ తో మహేష్ కి లింక్ నిజమేనా?

39
- Advertisement -

ఈ మ‌ధ్య అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ మ‌ల్టీవ‌ర్స్ హంగామా న‌డుస్తోంది. ఇంతకీ, మ‌ల్టీవ‌ర్స్ అంటే ఏమిటంటే.. ఒక దర్శకుడు తీసే సినిమాలలో ఒకదానికి మరోదానికి లింక్ ఉండటం. ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ చిత్రాలకు, సలార్ సినిమాకు లింక్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక తమిళంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీస్తున్న అన్నీ సినిమాలకు ఒకదానికి మరోదానికి లింక్స్ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తున్న గుంటూరు కారం మూవీ కూడా, త్రివిక్ర‌మ్ మ‌ల్టీవ‌ర్స్‌లో భాగంగా రానుంద‌ని తాజాగా నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇంతకీ, గుంటూరు కారం సినిమా, ఏ సినిమాకు మ‌ల్టీవర్సో తెలుసా ?, ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన అర‌వింద స‌మేతకు – గుంటూరు కారం సినిమాకు క‌నెక్ష‌న్ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ మూవీతో మహేష్ ‘గుంటూరు కారం’కు క‌నెక్ష‌న్ ఉంటే మాత్రం నిజంగా అదిరిపోతుంది. చాలా రోజుల నుంచి మహేష్ – ఎన్టీఆర్ కలయికలో ఓ సినిమా వస్తే బాగుంటుందని టాక్ ఉంది. మరి ఆ టాక్ త్రివిక్రమ్ రూపంలో భవిష్యత్తులో అయినా నిజం కావాలని కోరుకుందాం. సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read:శనగలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో!

ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీ నుంచి రిలీజైన ఫ‌స్ట్ సింగిల్‌కు ఆడియ‌న్స్ నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఇప్ప‌టికే 18 మిలియ‌న్స్ కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే, టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. అయితే, గుంటూరు కారం సినిమాతో బాలీవుడ్ లో కూడా మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల తో పాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -