స‌త్తా చాటిన ‘గల్లీ బోయ్’

283
gallyboy
- Advertisement -

బాలీవుడ్‌లో ఏటా అట్టహాసంగా నిర్వహించే ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. 65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2020 వేడుకకు బాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. అసోంలోని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకకు నిర్మాత కరణ్ జోహార్, నటుడు విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

2019లో బాలీవుడ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ద‌క్క‌గా గ‌ల్లీబోయ్ చిత్రం ఏకంగా 13 అవార్డుల‌ని అందుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఈ చిత్రానికి గాను ర‌ణ్‌వీర్‌కి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డ్ ద‌క్క‌గా, బెస్ట్ యాక్ట్రెస్‌గా అలియా భ‌ట్, ఉత్తమ ద‌ర్శ‌కురాలిగా జోయా అక్త‌ర్ ఫిలిం ఫేర్ సొంతం చేసుకున్నారు.

‘షోలే’ చిత్ర దర్శకుడు రమేష్ సిప్పీని జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. అలాగే, సీనియర్ నటుడు గోవిందకు ఎక్స్‌లెన్స్ అవార్డును అందజేశారు.

- Advertisement -