రాజస్థాన్‌పై గుజరాత్ గెలుపు..

59
gujarath
- Advertisement -

ఐపీఎల్‌లో గుజరాత్‌ మరో విజయాన్ని నమోదుచేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ విధించిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్…9 వికెట్లు కొల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది.

బట్లర్‌ (24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) అర్ధసెంచరీతో మెరుపులు మెరిపించగా కెప్టెన్‌ శాంసన్‌ (11),హెట్‌మయెర్‌ (29), డుస్సెన్‌ (6),పరాగ్‌ (18), నీషమ్‌ (17) విఫలం కావడంతో రాజస్థాన్ ఓటమి పాలైంది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కొల్పోయి 192 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 నాటౌట్‌),అభినవ్‌ మనోహర్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), డేవిడ్‌ మిల్లర్‌ (14 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 నాటౌట్‌) అదరగొట్టారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హార్దిక్‌ నిలిచాడు.

- Advertisement -