లక్నోపై గుజరాత్ జెయింట్స్ విక్టరీ…

114
gj
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా లక్నోపై ఘన విజయం సాధించింది గుజరాత్. లక్నో విధించిన 159 పరుగుల లక్ష్యచేదనలో బరిలోకి దిగిన గుజరాత్…19.4 ఓవర్లలో టార్గెట్‌ను చేజ్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ డకౌట్‌గా వెనుదిగిరిన మథ్యువేడ్ 30,కెప్టెన్ పాండ్యా 33,డేవిడ్ మిల్లర్ 30,రాహుల్ తెవాటియా 40 పరుగులు యేయడంతో గుజరాత్ విజయకేతనం ఎగురవేసింది.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోను షమీ కొలుకోలేని దెబ్బతీశాడు. రాహుల్‌ను డకౌట్‌ చేయగా తర్వాత డికాక్,మనిష్ పాండేలను వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో 29 పరుగులకే 4 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది లక్నో. దీపక్ హుడా (55), ఆయుష్ బదోనీ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

- Advertisement -