ముంబై పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం

31
- Advertisement -

ఐపీఎల్‌ 2023లో ముంబై పరాజయాల పరంపర కొనసాగుతోంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముంబై. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో నేహాల్ వధేరా(40; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) కామెరూన్ గ్రీన్‌(33; 26 బంతుల్లో 3 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్‌(23; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేశారు.

Also Read:భోజనం చేసిన తరువాత స్వీట్స్ తింటే.. ఎమౌతుందో తెలుసా ?

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్‌(56; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కాల‌తో ఆక‌ట్టుకోగా డేవిడ్ మిల్ల‌ర్‌(46; 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), అభిన‌వ్ మ‌నోహ‌ర్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ధాటిగా ఆడారు. ఆఖ‌ర్లో తెవాటియా ..20 నాటౌట్‌; 5 బంతుల్లో 3 సిక్స‌ర్లతో రాణించారు.

Also Read:బీజేపీకి ఆ పార్టీల భయం !

- Advertisement -