ఢిల్లీని చిత్తుచేసిన గుజరాత్..

113
gujarath
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని నమోదుచేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలుపొందింది. గుజరాత్ విధించిన 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంత్‌ (43), లలిత్‌ యాదవ్‌ (25), పావెల్‌ (20) ఫర్వాలేదనింపిచారు.

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. గిల్‌ (46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 84) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా హార్దిక్‌ పాండ్యా (31), మిల్లర్‌ (20 నాటౌట్‌) రాణించారు. ముస్తాఫిజుర్‌కు 3, ఖలీల్‌కు 2 వికెట్లు దక్కాయి.

- Advertisement -