క్వారంటైన్‌లో గుజరాత్ సీఎం..

181
vijay rupani
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,439కి చేరుకోగా 377 మంది చనిపోయారు. కరోనా నుంచి 1,306 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

ఇటీవల ఆ ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో భేటీ అయిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం కోవిడ్ -19 పరీక్ష చేయించుకున్న రూపానీ తనకు తాను నిర్బంధించుకున్నారు. బుధవారం నాటికి గుజరాత్‌లో మొత్తం 617 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. అలాగే మృతుల సంఖ్య 26కు చేరింది.

- Advertisement -