జీఎస్టీ వసూళ్ల గణాంకాలు విడుదల..

186
gst
gst
- Advertisement -

అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటిందని చెప్పింది. అక్టోబర్ నెలలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ .1,05,155 కోట్లు, ఇందులో సీజీఎస్టీ రూ .19,193 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.25,411కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ .23,375 కోట్లతో సహా), సెస్ రూ.8,011 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.932 కోట్లతో సహా) అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

గతేడాది గత ఏడాది ఇదే నెలలో రూ.95,379 కోట్లు వసూళయ్యాయి. దీంతో గతేడాది కంటే 11 శాతం జీఎస్టీ వసూలులో వృద్ధి కనిపించిందని చెప్పింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 3,383 కోట్ల జీఎస్టీ వసూలు చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు వ్యాపారాలు నిలిచిపోవడంతో జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. గత ఏడాది అక్టోబర్ నెలతో పోల్చితే 5% వృద్ధి నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.

- Advertisement -