ముగిసిన గోదావరి యాజమాన్య బోర్డు సబ్ కమిటీ భేటీ..

52
- Advertisement -

ఇవాళ గోదావరి యాజమాన్య బోర్డు సబ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ మెంబర్ సెక్రటరీ పాండే అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ వర్చువల్‌గా జరిగింది. పెద్దవాగు తప్ప ఇంకే ప్రాజెక్టు ఇవ్వమని జీఆర్ఎంబీ సబ్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ.. ఏపీలోని వెంకటనగరం లిఫ్ట్ పై సమావేశంలో చర్చించారు. గెజిట్ లోని రెండో షెడ్యూల్ గల కాళేశ్వరం బ్యారేజీలతో పాటు మిగతా ప్రాజెక్టులు మూడో షెడ్యూల్ లోకి మార్చాలంది రాష్ట్ర ప్రభుత్వం.. తాము ఇచ్చిన డీపీఆర్‌లపై నిర్ణయం తీసుకుని ప్రాజెక్టుల అనుమతి తేల్చే వరకు గోదావరి ప్రాజెక్టులపై చర్చించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -