తలసాని సాయి కిరణ్ యాదవ్ ఈ రోజు ఉదయం 9 గంటలకు వెస్ట్ మారేడ్ పల్లి లోని ఆయన నివాసంలో నానమ్మ లలితా భాయ్, తల్లిదండ్రులు మంత్రి శ్రీనివాస్ యాదవ్, సువర్ణ లకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అదేవిధంగా ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అక్కడి నుండి గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని అక్కడ నివాళులు అర్పించారు.
అనంతరం ప్రత్యేక వాహనంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాధ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్యే లు ఎగ్గే మల్లేశం, ప్రభాకర్, సలీం, హజ్ కమిటీ చైర్మన్ మసి ఉల్లా ఖాన్, నాంపల్లి టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ఆనంద్ గౌడ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా ఆబిడ్స్ లోని కలెక్టర్ కార్యాలయంకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీ లో డప్పు చప్పుళ్ళు, కళాకారుల పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.