గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో విప్లవాత్మక అడుగువేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదివాసి జీవనోపాధులను పునరుద్ధరించే వినూత్న ప్రయత్నంగా, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (GIC), ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ములాలగుట్ట 2 గ్రామంలో 5 ఎకరాల విస్తీర్ణంలో వెదురు సాగు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది.
ఇది తెలంగాణలోని ప్రత్యేకంగా అతి బలహీన గిరిజన వర్గం (PVTG) అయిన కొలాం (కొల్లం) తెగలు ఎదుర్కొంటున్న వెదురు బొంగు సమస్యను పరిష్కరించేందుకు రూపొందించిన తొలి ప్రాజెక్ట్. శతాబ్దాలుగా కొలాం సమాజం వెదురు బొంగుని ఉపయోగించి చాపలు, గంపలు, కంచెలు, ఆచార పరికరాలు వంటి ఉత్పత్తులను తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, అడవి సంరక్షణ చట్టాల కారణంగా వారికి సహజ బాంబూ వనరులపై ప్రవేశం తగ్గడంతో, రోజూ 7–10 కిలోమీటర్లు నడిచి తక్కువ మొత్తంలో బాంబూ సేకరించాల్సి వస్తోంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 6,000 కొలాం కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడటమే కాకుండా మధ్యవర్తుల దోపిడీకి గురవుతున్నాయి.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సానుభూతితో ముందుకు వచ్చిన జోగినపల్లి సంతోష్ కుమార్ (సంతోష్ అన్న) ఈ పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. స్థానిక దాత టేకం రావు జీ పటేల్ 5 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్ కోసం విరాళంగా అందించారు. ఈ స్థలం కొలాం సమాజానికి బాంబూ నర్సరీ మరియు సాగు కేంద్రంగా పనిచేయనుంది.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చరిత్రలో, ఈ ప్రాజెక్ట్ సమాజం కేంద్రంగా పర్యావరణ పునరుద్ధరణ వైపు కీలక మలుపు అని చెప్పవచ్చు. ప్రస్తుతం తోట పనులలో 50% పూర్తయింది. ఈ ప్రాంతపు నేల మరియు వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన బాంబూ జాతులను అడవి శాఖ నిపుణుల సూచనలతో, GIC వాలంటీర్ల సహకారంతో నాటుతున్నారు.
ఈ సందర్భంగా జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ —ఇది కేవలం వెదురు మొక్కలను నాటడం కాదు – వారి గౌరవాన్ని తిరిగి ఇవ్వడం అన్నారు.కొలాం తెగల కళారూపం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. స్థిరమైన బాంబూ సరఫరాతో ఉపాధి అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి, స్వావలంబన సాధ్యమవుతుంది. త్వరలో ఒక సామూహిక కార్యక్రమం నిర్వహించి తోట పనులు పూర్తిచేయడం, ఆధునిక బాంబూ కళాప్రమాణాలపై శిక్షణ ప్రారంభించడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ జాతీయ బాంబూ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది — బాంబూను స్థిరమైన, వేగంగా పెరిగే వనరుగా ప్రోత్సహిస్తూ, కార్బన్ శోషణ, నేల పునరుద్ధరణ, గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తోట పూర్తిగా ఎదిగిన తర్వాత ప్రతి సంవత్సరం వేలాది బాంబూ తాటలు లభించే అవకాశం ఉంది, ఇది కొలాం కళాకారుల జీవనానికి విశ్వసనీయ ఆధారం అవుతుంది. భవిష్యత్ దశల్లో విలువ ఆధారిత ఉత్పత్తులు మరియు న్యాయమైన మార్కెట్ లింకేజీ పై దృష్టి పెట్టి, మధ్యవర్తులను తొలగించి కళాకారులకు ప్రత్యక్ష విక్రయ అవకాశాలు కల్పించనున్నారు.
2018లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 20 కోట్లకు పైగా మొక్కలు నాటిన గ్రీన్ ఇండియా చాలెంజ్, కోట్లాది మందిని పచ్చదన ఉద్యమంలో భాగస్వామ్యులను చేసింది. ఈ ఆదిలాబాద్ బాంబూ ప్రాజెక్ట్, పర్యావరణ పరిరక్షణ మరియు గిరిజన సాధికారత కలయికగా GIC ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తోంది.స్థానికులు ఈ ప్రాజెక్ట్ను విప్లవాత్మకమని అభివర్ణించారు.

అత్రం జంగు, కొలాం కళాకారుడు మాట్లాడుతూ — బాంబూ మా ప్రాణాధారం. ఇప్పుడు ఈ తోట దగ్గర ఉండటంతో, మా పిల్లలు అడవుల్లో తిరగాల్సిన అవసరం లేదు. వారు మా కళను నేర్చుకొని, గౌరవంతో జీవించగలరు,” అని అన్నారు.తోట పనులు ముగింపు దశలో ఉండగా, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ స్వచ్ఛంద సేవకులు, NGOలు, ప్రకృతి ప్రేమికులను రాబోయే కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పచ్చటి, స్వావలంబనతో కూడిన, సమగ్ర తెలంగాణ దిశగా ముందడుగు వేస్తోంది.
మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అటవీ విస్తరణ, జీవ వైవిధ్య పరిరక్షణ, స్థిరమైన జీవన విధానాలు ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. వినూత్న ప్రచారాలు మరియు రికార్డు స్థాయి మొక్కల నాటే కార్యక్రమాల ద్వారా, GIC లక్షలాది భారతీయులను దేశ పచ్చదనం పరిరక్షణలో భాగస్వాములుగా చేసింది.
I’m excited to announce the launch of our Bamboo Project. This project is close to my heart as it focuses on creating a sustainable environment, supporting local artisans, and generating rural employment.
We’ve already planted crores saplings as part of the Green India… pic.twitter.com/jJ7SU3kGhA
— Santosh Kumar J (@SantoshKumarBRS) October 17, 2025
Also Read:డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు

