గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోన్న టీఆర్ఎస్ ఖతార్ సభ్యులు

466
green11a2
- Advertisement -

టీఆర్‌ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ నేతృత్వంలో ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విదేశాల్లోనూ కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు మేరకు టీఆర్‌ఎస్ ఖతార్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగొని, ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికెని, యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింకుంట, కార్యవర్గ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. కాలుష్యం పెరిగిపోవడాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో ఇప్పటికే కోట్లాది మొక్కలు నాటడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ ఈ కార్యక్రమం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు తేజా కుంబాజీ, ఎల్లయ్య తాళ్లపెళ్లి, రాజిరెడ్డి, అరుణ్ అలిశెట్టి, పాల మల్లేష్, మహేష్, కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -