శారదా పీఠంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

34
- Advertisement -

హైదరాబాద్ కొకాపేటలోని విశాఖ శారదా పీఠంవారి ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న రాజ శ్యామల దేవి మందిరం వద్ద శారదా పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారితో కలిసి మందిర ఆవరణలో రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ జమ్మి చెట్టును నాటారు.

దేవాలయ పరిధిలో మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. గతంలో కూడా గుడి, గుడి కి జమ్మి చెట్టు పేరుతో ప్రతీ దేవాలయ పరిధిలో జమ్మి చెట్టును నాటాము అని గుర్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి వంశిధర్ రావు మరియు వేద పండితులు పాల్గొన్నారు.

Also Read:కాంగ్రెస్‌కు నాగం రాజీనామా..త్వరలో బీఆర్ఎస్‌లోకి!

- Advertisement -