ఫాస్టాగ్‌ గడువు పొడగించిన కేంద్రం..

152
fastag
- Advertisement -

మరోసారి ఫాస్టాగ్ గడువును పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది.

అయితే ఇవాల్టీతో ఫాస్టాగ్ గడువు ముగియనుండగా కాస్త ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఫాస్టాగ్ గ‌డువును ఫిబ్ర‌వ‌రి 15, 2021 వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

2016లో తీసుకొచ్చిన ఈ కొత్త ఫాస్టాగ్ విధానం వ‌ల్ల టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర వాహ‌నాలు టోల్ చెల్లించ‌డానికి ఆగాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీనివ‌ల్ల విలువైన స‌మ‌యం ఆదా అవుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతూ వ‌స్తోంది.

- Advertisement -