అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ: తమిళి సై

26
ts
- Advertisement -

ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు గవర్నర్ తమిళి సై. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఇవాళ ఉదయం రాజ్ భవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పూర్తిగా తెలుగులో ప్రసంగించారు.

అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళి సై… రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని తెలిపారు. తెలంగాణకు సేవ చేసే అవకాశం తనకు దక్కిందని… ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అని చెప్పారు.

ఇందులో భాగంగా రాజ్ భవన్ స్కూలు లో విద్యార్థుల కోసం భోజన ఏర్పాటు చేశాను. కొవిడ్ కాలంలో నిర్విరామంగా ప్రజారోగ్య విభాగాన్ని పర్యవేక్షించాను. భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఆదివాసీ ప్రజలను కలిసి సహపంక్తి భోజనం చేశాను. అక్కడి ప్రజలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశాను. పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు అందించాను అని చెప్పారు.

- Advertisement -