Telangana: గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం

12
- Advertisement -

ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం ఉండనుంది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ప్రమాణం చేయించనున్నారు హై కోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరధే. గవర్నర్ ప్రమాణస్వీకారం కార్యక్రమంకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

2018 నుంచి 2023 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా జిష్ణు దేవ్ వర్మ పనిచేశారు. త్రిపుర నుంచి ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు జిష్ణు దేవ్ వర్మకు స్వాగతం పలకనున్నారు.

Also Read:TTD: తిరుమలలోని అన్ని హోటళ్లలో ఫిర్యాదుల బాక్స్‌లు

- Advertisement -