బీజేపీలో కుట్ర జరుగుతోంది:రాజాసింగ్ ఫైర్

178
Goshamahal MLA Raja Singh fires on Telangana BJP
- Advertisement -

తెలంగాణ బీజేపీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు గోషామహల్  ఎమ్మెల్యే, ఆ పార్టీ నేత రాజాసింగ్ .  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కు  రాజాసింగ్ లేఖ రాశారు. తనపై రాష్ట్ర బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లకు పదవులు కట్టబెట్టారని, నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పార్టీ కమిటీలు వేయడం ఏంటని ప్రశ్నించారు. తన వల్ల పార్టీకి ఇబ్బంది అనుకుంటే, పార్టీ నుంచి తొలగించమని లక్ష్మణ్‌ను లేఖ ద్వారా కోరారు.

కాగా గత నెలలో తెలంగాణలో అమిత్‌ షా పర్యటన సందర్భంగా కూడా రాజాసింగ్‌ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువని.. ఈ గ్రూపుల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానన్నారు

గతంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలో నాయకులను,కార్యకర్తలను ఎదగనివ్వకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని అన్నారు.కేంద్ర పధకాలను తెలంగాణలో ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. తాజాగా మరోసారి ఈ ఫైర్ బ్రాండ్ తన నిరసన గళం విప్పారు.

- Advertisement -