రెండు భాగాలుగా గోపిచంద్ బ‌యోపిక్..!

234
- Advertisement -

ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదారు నిర్మాణంలో ఉండగా ఇంకెన్ని వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ కథ కూడా చేరబోతోంది. అతని పాత్రలో సుధీర్ బాబు కనిపించబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు ఫైనల్ అయ్యిందని సమాచారం. కాకపోతే ఇది సింగల్‌గా కాకుండా ఎన్టీఆర్ తరహాలో రెండు భాగాలుగా తీసుకొచ్చే ప్రతిపాదన ఉందట. సెట్స్ పైకి వెళ్ళేలోపు దీని మీద నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.

Pullela Gopichand

ఇక ఇండస్ట్రీలోకి యువ కెరటంలా దూసుకు వచ్చిన మహేష్ బావ సుధీర్ బాబు బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. సుధీర్ స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం, పుల్లెల గోపిచంద్‌తో సుధీర్‌కు మంచి సాన్నిహిత్యం ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేసేందుకు సుధీర్ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. పలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వస్తున్నాయని, తెలుగు, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని అంటున్నారు. ఈ మూవీపై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

- Advertisement -