ఇండియా-పాకిస్థాన్ బోర్డర్‌లో గోపీచంద్..

180
Gopichand
- Advertisement -

యాక్ష‌న్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ సోమవారం ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్‌లో ప్రారంభమయ్యింది.. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్‌తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు.

Gopichand

యాభై రోజు ల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు.. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 18గా అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Gopichand

నటీనటులు : గోపీచంద్, సాంకేతిక నిపుణులు :కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: తిరు,నిర్మాత: రామబ్రహ్మం సుంకర,బ్యానర్: ఎకే ఎంటర్టైన్మెంట్స్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి,సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్,సంగీతం: విశాల్ చంద్రశేఖర్,సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి,రచయిత: అబ్బూరి రవి,ఆర్ట్: రమణ వంక,కో డైరెక్టర్ : దాసమ్ సాయి, రాజ్ మోహన్,పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ : విశ్వా CM,పి.ఆర్.ఓ : వంశీ శేఖర్.

- Advertisement -