విజయవంతంగా దూసుకుపోతున్న గ్రీన్ ఛాలెంజ్..

90
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని డా.మార్కండేయులు, కోట్ల రామ్ మోహన్‌ల ఆధ్వర్యంలో బృందం మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని.. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుందని డా.మార్కండేయులు, రామ్మోహన్ లు అన్నారు.

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ కౌన్సిలర్ మర్రి అర్చన రాంరెడ్డి, డా. కృష్ణ గౌడ్‌, పరమేష్‌, గోవర్దన్,రాజు , కాలనీ ప్రతినిధులు ,కే. వెంకటేష్‌,రవిబాబు,గణేష్ గౌడ్, వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -