ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

293
prabhas
- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో చిత్రం త‌ర్వాత రాధాకృష్ణ దర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. గోపికృష్ణా మూవీస్ బ్యానర్, యువీ క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం ఈమూవీ షూటింగ్ వాయిదా ప‌డింది. ఈమూవీకోసం హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో ఒక ప్ర‌త్యేక‌మైన సెట్ వేస్తున్నారు. ఈమూవీలో ఈ సెట్ ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ట‌.

ఇదిలా ఉండ‌గా ఈనెల చివ‌ర్లో ఈమూవీ నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్నారు చిత్ర‌యూనిట్. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ని దాదాపు ఫైనల్ చేశార‌ని టాక్. సాహో చిత్రం త‌ర్వాత‌ ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సాహో చిత్రం ప్రేక్ష‌కుల‌ను కాస్త నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఈమూవీపై పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నాడు ప్ర‌భాస్.

- Advertisement -