ఎన్టీఆర్ – మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

15
- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘RRR’ మూవీ అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్ పాత్రను సైడ్ రోల్ చేశారనే విమర్శలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెక్ పెట్టారు. `ఒకవేళ కొమురంభీముడో పాటతోనే సినిమా ఎండ్‌ అయితే, అప్పుడు రామ్‌ చరణ్‌ ది సైడ్‌రోల్‌ అవుతుంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై తారక్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

అలాగే, మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కనున్న అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ‘SSMB29’ నుంచి బిగ్ అప్ డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ను ఏప్రిల్ 9న ఉగాది సందర్భంగా మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ తరువాత దర్శకధీరుడు రాజమౌళి పేరు ప్రపంచమంతా మారుమోగింది.

దీంతో మహేశ్ బాబుతో చేయబోతున్న సినిమాపై ఊహకందని అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగ్గట్లుగానే రచయిత విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారట. అడవి నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం గమనార్హం. మరి రాజమౌళి-మహేశ్ సినిమా కథ నేపథ్యం అడవి కావడమే ఇక్కడ ఆసక్తిని పెంచుతుంది. మరి ఈ నేపథ్యంలో రాజమౌళి ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి. ఒక్కటి అయితే మాత్రం నిజం ఈ సినిమా మరో అద్భుతాన్ని క్రియేట్ చేయబోతుంది.

Also Read:కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తేలేదు:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

- Advertisement -