గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే గొంగిడి సునీత..

357
gongidi sunitha
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటారు ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గొంగిడి సునీత. గత మూడు రోజులుగా వానచినుకులు ఎడతెరపి లేకుండా కురుస్తున్నా , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మాత్రం వర్షం తో పోటీపడుతోంది.

ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు జన్మదినం పురస్కరించుకొని , ఎంపీ సంతోష్ కుమార్ గారు జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలియజేసి , గ్రీన్ ఛాలెంజ్ విసిరారు . దానిని స్వీకరించి ఆలేరు లో తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు మాట్లాడుతూ తన పుట్టిన రోజున మూడు మొక్కలు నాటాలి అని ట్విట్టర్ ద్వారా కోరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కి మద్దతు గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి ప్రజల్లో మంచి అవగాహనా కల్పిస్తూ , చెట్లు నాటే విదంగా ప్రోత్సహిస్తున్నారు . అనతికాలంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , దేశమంతా ప్రజాదరణ పొందింది , ప్రాంతాలకు అతీతంగా మొక్కలు నాటి , వాటిని కాపాడే విదంగా చర్యలు తీసుకుంటూ , పర్యావరణ పరిరక్షణ కి తోడ్పాటు అందిస్తున్నా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు . ఈ కార్యక్రమం ఇలానే విజయవంతంగా ముందుకు సాగాలని కోరారు . మొక్కలు నాటినందుకు ఎంపీ సంతోష్ కుమార్ గారు , ఎమ్మెల్యే గారికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు .

- Advertisement -