శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం సీజ్..

102
gold
- Advertisement -

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. 248.4 గ్రాముల బంగారాన్ని పట్టుకోగా దాని విలువ రూ.12.74 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. జడ్డా నుంచి శంషాబాద్ కు వచ్చిన విమానంలో ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి వద్ద 248.4 గ్రాముల విదేశీ బంగారం లభ్యమైంది. దీంతో అధికారులు అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలె దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 407 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దాని విలువ రూ.20.25 లక్షలు.

- Advertisement -