పసిడి పరుగు…..వెండి దూకుడు

170
gold
- Advertisement -

బంగారం ప్రేమికులకు షాక్….పసిడి పరుగు పెట్టగా వెండి దూకుడు మీదుంది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 పెరిగి రూ.48,070కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.310 పెరిగి రూ.44,060కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధరపై రూ. 800 పెరిగి రూ.73,400కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 1815 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.55 శాతం పెరుగుదలతో 27.16 డాలర్లకు చేరింది.

- Advertisement -