జీఎంఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రిలీఫ్ విమానాలు

389
gmr
- Advertisement -

ప్రపంచం మొత్తం కోవిడ్-19 మహమ్మరి బారిన చిక్కుకున్న ఇలాంటి విపత్కర సమయంలో, భారతదేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉన్న సందర్భంలో, కోవిడ్-19 రిలీఫ్ మరియు తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూ GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల వారిని సరిహద్దులు దాటిస్తూ జాతికి తన వంతు సేవలను అందిస్తోంది.

దీనిలో భాగంగా నేడు హైదరాబాద్ నుంచి కొందరు అమెరికా జాతీయులను వారి స్వదేశానికి తరలించేందుకు వచ్చిన రెండు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాయి. వీటిలో మొదటి విమానం AI 1615(అరైవల్స్)/ AI 1616 (డిపార్చర్) మధ్యాహ్నం 1.52 గంటల సమయంలో హైదరాబాద్ లో దిగి మధ్యాహ్నం 3.03 గంటల సమయంలో ముంబైకు వెళ్లింది. దీనిలో 69 మంది పెద్దలు, 1 శిశువు తరలివెళ్లారు.

రెండో విమానం AI 1617(అరైవల్స్)/AI 1618(డిపార్చర్) మధ్యాహ్నం 3.12 గంటల సమయంలో హైదరాబాద్‌లో దిగి, అమెరికా వెళ్లాల్సిన ప్రయాణికులతో సాయంత్రం 4.24 గంటలకు ముంబై వెళ్లింది. దీనిలో 96 మంది పెద్దలు, 2 శిశువులు తరలివెళ్లారు. ఈ అమెరికా జాతీయులంతా ముంబై నుంచి మరో ప్రత్యేక విమానంలో అమెరికాలోని తమ స్వస్థలాలకు వెళతారు.

అమెరికా కాన్సులేట్ మరియు తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో ఈ అమెరికా జాతీయులంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల నుంచి సుమారు మధ్యాహ్నం 12 – 2 గంటల మధ్య విమానాశ్రయానికి వచ్చారు. ఈ ప్రయాణికుల కోసం పూర్తిగా శానిటైజ్ చేసిన ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌ను సిద్ధంగా ఉంచారు.

ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి GHIAL కు చెందిన టెర్మినల్ ఆపరేషన్స్ సిబ్బంది, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్, AOCC, ATC, ల్యాండ్ సైడ్ సెక్యూరిటీ, సీ.ఐ.ఎస్.ఎఫ్., ఇమిగ్రేషన్, కస్టమ్స్, APHO (ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్), ఎయిర్ లైన్ గ్రౌండ్ హ్యాండ్లర్లు, ARFF (ఎయిర్ పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్) సేవలు RAXA సెక్యూరిటీ, ట్రాలీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

టెర్మినల్‌లో ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. స్పెషల్ స్క్రీనింగ్, పలు భద్రతా చర్యల అనంతరం, తగిన భౌతిక దూరాన్ని పాటిస్తూ వారు ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్స్ ను దాటుకుని విమానంలోకి వెళ్లారు.

ఏప్రిల్ 7న 99 మంది అమెరికా జాతీయులు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. మార్చి 31న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానం ద్వారా 38 మంది జర్మనీ జాతీయులను వారి స్వదేశానికి తరలించేందుకు సహాయపడింది. మార్చి 28న ఇండిగోకు చెందిన ప్రత్యేక మెడికల్ ఎవాక్యుకేషన్ విమానం కూడా హైదరాబాద్‌లో దిగి, తన 8 మంది సిబ్బందిని హైదరాబాద్‌లో దింపి, ఇక్కడ చిక్కుకుపోయిన ఐదుగురు సిబ్బందితో చెన్నైకు తరలివెళ్లింది.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకవైపు నిరంతరం తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూనే మరో వైపు సప్లై చెయిన్ విమానాలు నడిచేందుకు నిరంతరం సహకరిస్తూ, దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సప్లై చెయిన్ ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తోంది. గ్రౌండ్ హ్యండ్లరు, ఫార్వర్డర్లు, కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు, రెగ్యులేటర్లు, రాష్ట్ర పోలీసులు, కార్గో ట్రేడ్ అసోసియేషన్లతో కలిసి అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులు నిరంతరం రవాణా కొనసాగేందుకు కృషి చేస్తోంది.

- Advertisement -