అమెరికాలో రోడ్డు ప్రమాదం..టీడీపీ ఎమ్మెల్సీ మృతి

236
gitam murthy dies
- Advertisement -

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ అధినేత,టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు యుఎస్ వెళ్లిన ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్లారు.

సోమవారం మధ్యాహ్నం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ప్రమాద సమయంలో ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్‌ చౌదరి మృతి చెందగా.. కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నెల 6న గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో మూర్తి ప్రసంగించాల్సి ఉంది. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తానా సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూర్తి మృతిపై టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -