బ్ర‌తికుండ‌గానే పూడ్చి పెట్టారు..

193
girl-buried-alive-2-hours-bihar
girl-buried-alive-2-hours-bihar
- Advertisement -

బ్ర‌తికుండ‌గానే ఓ యువ‌తిని పూడ్చి పెట్టిన దారుణ ఘటన బిహార్‌లో క‌ల‌క‌లం రేపింది. బాధితురాలు దాదాపు రెండు గంటలపాటు గుంతలోనే ఉన్న ఈ ఘటన బీహార్‌లోని గోవిందపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఖుష్బూ తన ఇంటిలో ఉండగా ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. బలవంతంగా లాక్కెళ్లి 3 అడుగుల గుంతలో పూడ్చిపెట్టారు. ఖుష్బూ ఇంట్లో కనిపించకపోయేసరికీ ఆమె తల్లిదండ్రులు అన్సారీ, సంజన కూతురి కోసం చుట్టుపక్కలా గాలించగా ఓ గుంత కనపడింది. అనుమానం వచ్చి, వెంటనే గుంతను తవ్వి చూడగా ఖుష్బూ స్పృహ కోల్పోయి కనపడింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమెకు స్పృహ తెప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ షాక్‌కు గురికావడంతో ఆమె స్పృహలోకి రాలేకపోయింది. ఆమెను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. షాక్‌ కు గురైన ఖుష్బూ కోలుకోకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి, అమిత్ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

ఈ దారుణానికి ఒడిగట్టింది స్థానిక వ్యాపారి అమిత్ షా అని బాధిత యువతి పోలీసుల‌కు తెలిపింది. యువ‌తి త‌ల్లితండ్రుల‌కు చెందిన‌ స్థ‌లంలో ఓ భవనం కడతానని ప్రతిపాదించాడు స‌ద‌రు వ్యాపారి. దానికి వారు అంగీకరించక‌పోవ‌డంతో పలు మార్లు అమిత్ షా వారిని బెదిరించాడు. ఆ బెదిరింపులను వారు పట్టించుకోకపోవడంతో….వారి ఇంటిపై దాడి చేసిన ఇద్దరు దుండగులు… ఇంట్లో ఉన్న వారి కుమార్తె ఖుష్బూ (19)ను కొట్టి, బలవంతంగా లాక్కెళ్లి దగ్గర్లో ఉన్న 3 అడుగుల గుంతలో పూడ్చిపెట్టారు. ఖుష్బూను గుంత నుంచి తీస్తున్న వీడియోను వారు పోలీసులకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

https://youtu.be/RXq65vdTT28

- Advertisement -