Harishrao:గిరిజన బంధు అమలుచేస్తాం..

20
- Advertisement -

బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే గిరిజన బంధు ఇస్తారన్నారు మంత్రి హరీశ్ రావు. మేడ్చల్ జిల్లాల్లోని శామీర్‌పేటలో గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు హరీశ్. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన గిరిజన ప్రజాప్రతినిధులకు పేరు పేరున అభినందనలు తెలిపారు. ఎంతో దూరం నుండి ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ కు ముందు….కేసీఆర్ కు తరువాత అని ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయాలన్నారు.

కేసీఆర్ కు ముందు తాండల పరిస్థితి ఏంది.ఇప్పుడు ఏంది ఆలోచించాలన్నారు. ఆనాడు త్రాగు నీళ్ల కోసం ఎంత కష్టపడ్డారో చూడండి…నారాయణ ఖేడ్ లో బిందలతో ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆనాడు మంచం ఎక్కిన తండా….విష జ్వరాలతో గిరిజన గుడాలు అని పేపర్ లలో హెడ్డింగ్లు వచ్చాయన్నారు. ఇవాళ త్రాగు నీరు కష్టాలు లేవు….మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తున్నాం అన్నారు.2009 లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది తాండలను గ్రామ పంచాయతీ లు చేస్తాం అని చేసిందా …..లేదు అన్నారు.

కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత అన్ని తాండలను గ్రామ పంచాయతీ లు చేశారన్నారు. ఆనాడు తాండలను గ్రామ పంచాయతీ లు చేయాలని ఎన్నో పోరాటాలు…ఎన్నో ఉద్యమాలు.నేను కూడా తాండలను గ్రామ పంచాయతీ లు చెయాలని ఆనాడు పోరాటంలో పాల్గొన్ అన్నారు.4 లక్షల 50 వేల ఎకరాల పొడు భూములకు పట్టాలు ఇచ్చింది మన కేసీఆర్ …పొడు భూములకు పట్టాలు ఒక్కటే కాదు రైతు బంధు ఇచ్చింది మన ప్రభుత్వం అన్నారు.ప్రతి గిరిజన బిడ్డ చదువుకోవాలని గిరిజన గురుకుల పాఠశాలు ఏర్పాటు చేసిందని..విదేశీ విద్య పథకం పెట్టి ఎంతో మంది గిరిజన బిడ్డలకు విదేశీ విద్యను అందించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.గిరిజన బిడ్డలు ఆత్మగౌరవం తో బ్రతకాలి అని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు.

Also Read:చిన్నా..ఓటీటీ డేట్ లాక్!

- Advertisement -