48,232 మందికి వరద సాయం- జీహెచ్ఎంసీ

199
GHMC
- Advertisement -

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో భారీగా వరదలు వచ్చిన విషయం తెలికసిందే. ఈ నేపథ్యంలో వరద బాధితులకు ప్రతీ ఇంటికి 10 వేల రూపాయలు సాయం అందించారు. అయితే జీహెచ్‌ఎంపీ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులు ఈ వరద సాయం నిలిపివేశారు. ఎన్నికల అనంతరం మళ్లీ 10 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం నాడు 10005 మందికి వరద సహాయంగా రూ. 10 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. గత మంగళ వారం నుండి నేటి వరకు 48232 మందికి రూ. 48.23 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకులలో జమ చేశారని వెల్లడించింది.

- Advertisement -