జర్మనీ గాయనితో ప్రధాని మోడీ..

7
- Advertisement -

భారత పర్యటనకు వచ్చిన జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్‌ని కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారతీయ సంగీతం, సంస్కృతం పట్ల కసాండ్రాకు ఉన్న అభిరుచిని ప్రశంసించారు మోడీ.

ఈ సందర్భంగా అచ్యుతం కేశవం పాటతో పాటు ఓ తమిళ పాటను ప్రధాని మోడీకి వినిపించారు కసాండ్ర. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మధురమైన స్వరం.. ప్రతి పదం భావోద్వేగాలను ప్రతిబింబిస్తుందన్నారు మోడీ. కసాండ్రా కేవలం హిందీలోనే కాకుండా ఇతర భారతీయ భాషల్లో కూడా పాడుతుందని తెలిపారు.

Also Read:శాలరీ అకౌంట్ వాడుతున్నారా..మీ కోసమే!

- Advertisement -