గీతాంజలి మళ్ళీ వచ్చింది..పెద్ద హిట్ అవ్వాలి

11
- Advertisement -

అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల నటి అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కు దర్శకుడు బుచ్చిబాబు, బాబీ, గోపీచంద్ మలినేని, హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో..

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘కోన వెంకట్ గారితో గత ఏడాది నుంచి పని చేస్తున్నాను. త్వరలోనే ఆయనతో ఓ చిత్రాన్ని చేస్తున్నాను. కథ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. తొందర పెట్టరు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ ఇలా అందరూ నాకు కావాల్సిన వాళ్లు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. దర్శకుడికి మంచి పేరు రావాలి. మార్చి 22న థియేటర్లో అందరినీ నవ్విస్తూ, భయపెట్టి కలెక్షన్లు కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను. అంజలి గారు యాభై సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేస్తూ సక్సెస్ సాధించడం గర్వంగా ఉంది. ఇంకా వంద, 150 ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. నందు, భాను టాప్ రైటర్లు కాబోతోన్నారు. మార్చి 22న ఓం భీం బుష్ కూడా రాబోతోంది. అన్ని చిత్రాలు మంచి కలెక్షన్లను సాధించాలి’ అని అన్నారు.

అంజలి మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా ప్రత్యేకం. గీతాంజలి నాకు ఫస్ట్ సెంట్రిక్ మూవీ. ఇది నాకు 50వ సినిమా. నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. గీతాంజలి మళ్లీ వచ్చింది మరింత ఎక్కువగా నవ్విస్తుంది. భయపెడుతుంది. థియేటర్లో మంచి అనుభూతిని పొందుతారు. 50 సినిమాలు అనేది స్పెషల్ నంబర్. నాకెంతో ఆనందంగా ఉంది. దర్శకుడు శివకు మంచి భవిష్యత్తు ఉంది. శ్రీనివాసరెడ్డి, రాజేష్, అలీ, షకలక శంకర్, అవినాష్, రాహుల్ ఇలా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం అంతా చాలా కష్టపడి చేశాం. సిద్దు విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ బాగుంటుంది. ఆర్ఆర్, పాటలు బాగా ఇచ్చారు. నందు, భాను రైటింగ్ బాగుంది. ఈ చిత్రానికి అన్నీ చక్కగా కుదిరాయి. కోన గారు ఈ సినిమాకు చాలా ప్రత్యేకం. పదేళ్ల తరువాత కూడా ఈ సినిమాను తీయగలిగాం అంటే.. అది ఆయన వల్లే. నిశ్శబ్దం టైంలోనే ఈ మూవీ పాయింట్ చెప్పారు. కానీ కథను రెడీ చేయడానికి ఇంత టైం పట్టింది. కానీ షూటింగ్‌ను మాత్రం చాలా వేగంగా పూర్తి చేశాం. మా ఈవెంట్‌కు వచ్చిన దర్శకులు బాబీ, గోపీచంద్ గారికి థాంక్స్. శ్రీ విష్ణు తన సినిమా రిలీజ్ అవుతున్నా కూడా మా కోసం రావడం చాలా గ్రేట్. మా రెండు చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి. మార్చి 22న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది మార్చి 22న రాబోతోంది. మా సినిమాను ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలి. శ్రీ విష్ణు గారి ఓం భీం బుష్, మా సినిమా సక్సెస్ మీట్‌లు రెండూ ఒకేసారి జరగాలి. సినిమా షూటింగ్ అంతా సరదాగా సాగింది. పదేళ్ల తరువాత ఈ సీక్వెల్ తీసి కోన వెంకట్ గారు మా అందరికీ బూస్ట్ ఇచ్చారు’ అని అన్నారు.

Also Read:‘కారు జోరు’ గ్యారంటీ !

- Advertisement -