హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ..

281
- Advertisement -

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో మరో కలికితురాయి. ఇప్పటికే ఏరోస్పేస్ రంగంలో తనదైన ముద్రవేసుకున్న హైదరాబాద్ నగరంలో మరొక అంతర్జాతీయ పెట్టుబడి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత జీఈ గ్రూప్ మరియు టాటా కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కలిసి విమాన ఇంజన్ మరియు ఇతర విమాన కంపోనెంట్లను తయారీ చేయనున్నారు. గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం జీఈ కంపెనీని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతూ వస్తుంది. గత ఏడాది అమెరికాలోని సంస్ధ చైర్మన్‌తో సమావేశమైన మంత్రి కేటీ రామరావు సమావేశం అయ్యారు. టాటా సంస్థతో జీఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో నిన్న డిల్లీలోను మరోసారి సంస్ధ చైర్మన్‌తో సమావేశం అయ్యారు.

GE, Tata Group join hands to make LEAP engine parts

విమాన ఇంజన్ తయారీ కాంపొనెంట్ లతోపాటు రానున్న కాలంలో హైదరాబాద్ నుంచే మిలటరీ విమానాల ఇంజన్లు మరియు ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలకు సంబంధించిన ఇతర పరికరాల తయారీ అవకాశాలను కూడా పరిశీలించనున్నట్లు కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలు ఈరోజు తెలిపింది. ఈ వ్యూహత్మక ఒప్పంద ద్వారా జీఈ ఏవియేషన్ మరియు హైదరాబాద్‌లో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టాసిల్) కలసి ఏయిర్ క్రాప్ట్ కాంపోనెంట్స్ తయారీ, అసెంబ్లీంగ్, టెస్టింగ్ వంటి రంగాల్లో కలిసి పనిచేస్తాయి. దీంతోపాటు కొత్తగా సెంటర్ అప్ ఏక్స్లెలెన్స్ ఏర్పాటు చేసి ఎయిర్ క్రాప్ట్ ఇంజన్ తయారీకి అవసరం అయిన ఈకోసిస్టమ్ ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి తయారు చేయనున్న ఈ ఇంజన్ ప్రపంచంలోనే ప్రముఖమైన ఏయిర్ క్రాప్ట్ ఇంజన్ గా పేరు పొందింది. ఈ రంగంలో రానున్న ఇతర భాగస్వామ్యాలకు కూడా ఈ ఇంజన్ తయారీ అంశం ఒక కీలకమైన అంశంగా ఉండబోతున్నది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో హైదరాబాద్ కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవ కాశం ఉంది.

GE, Tata Group join hands to make LEAP engine parts
టాటా సంస్థకు భారతదేశ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా ఉన్నదని, లీఫ్ ఇంజన్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో తమ సంస్థ టాటాతో చేసుకున్న భాగస్వామ్యం ద్వారా ఆ డిమాండ్‌ను అందుకోగలమని జీఈ సంస్ధ చైర్మన్ జాన్ ఏల్ ఫ్లానరీ అన్నారు. టాటా సంస్థతో చేసుకున్న భాగస్వామ్యం మేకిన్ ఇండియా స్పూర్తికి అనుగుణంగా రానున్న రోజుల్లో మరిన్ని నూతన సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా కొనసాగుతుందని అయన తెలిపారు.

జీఈతో భాగస్వామ్యం ద్వారా మరింత భారతదేశంలోని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ నిపుణత, సామర్ధ్యాలను పెంచుతుందని టాటా చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. భారత దేశ రక్షణ దళాల అవసరాలకు అనుగుణంగా నూతన రక్షణ రంగ ఉత్పత్తుల తయరీకీ ఈ ఒప్పందం సహకరిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఏయిరో స్పెస్ రంగానికి ఈ ఒప్పందం మరింత ఉతం ఇస్తుందని మంత్రి కెటి రామరావు అన్నారు. నిన్న జరిగిన సమావేశంలో జీఈ సంస్ధ చైర్మన్‌కు జాన్ ఫ్లానరీకి తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా దన్యవాదాలు తెలిపామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏయిరో స్పేస్ తయరీ రంగానికి ఆది నుంచి అండగా ఉన్న టాటాసంస్ధకు, రతన్ టాటాకు, సంస్ధ చైర్మన్ చంద్రశేఖరన్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -