గ్యాస్ వినియోగదారులకు షాక్…

84
gas
- Advertisement -

వంట గ్యాస్ వినియోగదారులకు షాక్. ఇప్పటికే రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు నూనెలు, ప‌ప్పు ధాన్యాల ధ‌ర‌లు అమాంతం పెరిగిన విష‌యం విదిత‌మే. అలాంటి వారిపై గ్యాస్ బండ పడింది. 14 కేజీల వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ. 50 పెంచుతూ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు నేటి నుంచే అమ‌ల్లోకి రానున్నాయి.

దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.949.50గా ఉంది. పెంచిన ధరలతో తెలంగాణలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1000 దాటింది.

- Advertisement -