మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ ధ‌ర‌..

87
GAS
- Advertisement -

గ్యాస్ ధ‌ర మ‌ళ్లీ పెరిగింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో వెయ్యి దాటగా తాజా పెంపుతో అన్ని నగరాల్లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటింది.

హైదరాబాద్‌లో తాజా పెంపుతో 1056కు చేర‌గా ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్‌ ధర రూ.1003కు చేరింది. ఈ నెల 7న సిలిండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే.

ఇక 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.8 పెంచడంతో రూ.2364కు చేరింది. 19 రోజుల వ్యవధిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ధర పెరగడం ఇది రెండోసారి.

- Advertisement -