త్వరలో కరీంనగర్‌కు 24గంటల మంచినీటి సరఫరా:గంగుల

274
gangula kamalakar
- Advertisement -

త్వరలోనే కరీంనగర్ నగరానికి 24 గంటల మంచినీటి సరఫరాను ప్రారంభిస్తాం అన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా డెయిలీ వాటర్ సప్లై స్కీం ప్రారంభం సందర్భంగా ….కరీంనగర్ కు డెయిలీ వాటర్ సప్లై అందించాలన్న కల సాకరమైందన్నారు.

గతంలో రోజు విడిచి రోజు నీళ్లు వచ్చేవి. ఇకపై ప్రతి రోజు నీటి సరఫరా జరుగుతుందన్నారు. హైదరాబాద్ కే పరిమితమైన ఐటీ రంగాన్ని కరీంనగర్ కు తేవాలని ఇక్కడ 34 కోట్లతో ఐటీ టవర్ నిర్మించాం అన్నారు.

కరీంనగర్ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్మించిన ఐటీ టవర్ ను శంకు స్థాపన చేసి, ప్రారంభించిన ఘనత కేటీఆర్ కే దక్కిందన్నారు. ఓ వైపు ఐటీ టవర్ పూర్తి చేసాం. మరోవైపు మానేరుపై కేబుల్ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావస్తున్నాయని చెప్పారు. బ్రహ్మాండంగా కరీంనగర్ లో ప్రధాన రహదారులు నిర్మించాం…..అన్ని రకాలుగా కరీంనగర్ ను అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు మరవబోరని తెలిపారు.

- Advertisement -