వ్యాక్సిన్‌తో కరోనాను తరిమేద్దాం: గంగుల

78
covid
- Advertisement -

వ్యాక్సిన్‌తో కరోనాను కలిసికట్టుగా తరిమేద్దామన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌లో 12-14 ఏళ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన గంగుల…
ముందు జాగ్రత్తగా కొవిడ్‌ టీకాలు తీసుకోవాలన్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారంతా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని సూచించారు.

15 నుంచి 17 సంవత్సరాల వయసు గల వారికి సుమారు 50వేల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తిచేశామని తెలిపారు. 12 నుంచి 14 సంవత్సరాల వయసుగల పిల్లల్ని జిల్లాలో 44 ,570 మంది ఉన్నట్లు గుర్తించామని, వీరందరికీ మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తిచేశాక, 28 రోజుల తర్వాత రెండో డోసు టీకాలు వేస్తామన్నారు.

ఇప్పటికే పోలియోను పారద్రోలామని….అలాగే మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా కలిసి రావాలన్నారు. కొవిడ్‌-19 టీకా మొదటి డోసును 100శాతం పూర్తి చేశామని, రెండో డోస్‌ను 105శాతం పూర్తి చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపామన్నారు.

- Advertisement -