ఆ నటుడిపై కొపంగా ఉన్న గాలి…?

235
- Advertisement -

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం బుధవారం బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. నగరం నడిబొడ్డున 36 ఎకరాల విస్తీర్ణంలోని ప్యాలెస్‌ మైదానంలో తిరుపతి, హంపి, బళ్లారి తరహాలో సినీ సెట్టింగ్‌లతో అత్యద్భుతంగా పెళ్లి వేదికను ఏర్పాటుచేశారు. నాలుగు రోజులుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించేలా నిర్వహించారు. ఈ పెళ్లికి రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారు. కాని తాను కోరుకున్న విధంగా తన కుమార్తె పెళ్లి చేశానన్న సంతోషం ఉన్నప్పటికీ.. ఓ విషయంలో మాత్రం గాలిజనార్ధనరెడ్డి కోపంతో ఉన్నాడట..!

gali janardhan reddy fire saikumar

ఈ పెళ్లికి సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు పెద్దగా హాజరు కాలేదు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో టాలీవుడ్‌ సెలబ్రిటీలను గాలి జనార్ధనరెడ్డి ఈ వివాహానికి ఆహ్వానించాడు. అంతేకాదు వారందరినీ పెళ్లికి తీసుకురావాల్సిన బాధ్యతను నటుడు సాయికుమార్‌పై పెట్టాడట. ఈ బాధ్యతను తీసుకున్న సాయికుమార్‌, అతని తమ్ముడికి గాలి జనార్ధనరెడ్డి తగిన పారితోషికం కూడా ఇచ్చాడట. అయితే పెళ్లికి టాలీవుడ్‌ బిగ్‌ సెలబ్రిటీలను తీసుకెళ్లడంలో సాయికుమార్‌, అతని తమ్ముడు ఫెయిల్ అయ్యారట, అందుకే గాలిజనార్ధనరెడ్డి వీరిద్దరిపై అసంతృప్తితో ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.

gali janardhan reddy fire saikumar

పెళ్లికి ముందు జరిగిన సంగీత్‌ కార్యక్రమానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తమన్నా, బ్రహ్మానందం, సుమన్‌ వంటి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అక్కడ వారు చేసిన డ్యాన్సులకు, స్కిట్స్‌కు పెద్ద మొత్తంలోనే డబ్బులందుకున్నారట. అయితే పెద్ద సెలబ్రిటీలను తీసుకురాలేకపోయినందుకు సాయికుమార్‌పై కోపంగా ఉన్నారట గాలి బ్రదర్స్‌. హైదారాబాద్‌లో జరిగే రిసెప్షన్‌కు పెద్ద స్టార్లందరినీ తీసుకువస్తానని గాలి బ్రదర్స్‌కు ప్రామిస్‌ కూడా చేశాడట సాయికుమార్‌ .

- Advertisement -