వరుసగా 17వ రోజు పెట్రో మంట..

211
petrol price
- Advertisement -

ఓ వైపు కరోనా…మరోవైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వరుసగా 17వ రోజు పెట్రోల్ ధరలు పెరగడంతో వినియోగదారులపై పెను భారం పడింది.

మంగళవారం 20 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.83.29కి చేరుకోగా డీజిల్ 55 పైసలు పెరిగి లీటర్ డిజిల్ ధర రూ.78.01కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్టం.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.76గా ఉండగా డిజిల్ ధర రూ.79.40 కి చేరింది.గత 17 రోజుల్లో పెట్రోల్ ధర రూ.8.50 పెరగగా డిజిల్ ధర రూ. 10కి వరకు పెరిగింది.

- Advertisement -