మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సీట్లు మనమే గెలవాలిః మాజీ మంత్రి నాయిని

354
Nayini Naraasimha Reddy Speech
- Advertisement -

ముషీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాం నగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈసందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కోసం టీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని అన్ని సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్దులు విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త సంఘటితంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

- Advertisement -