ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను సన్మానించిన ఎమ్మెల్యే హరీష్‌ రావు

438
Harish Rao New
- Advertisement -

సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో 100శాతం ఉత్తిర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, 10/10 GPA సాధించిన 46 మంది విద్యార్థినీ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. NRIలు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో ఈ కార్యక్రమం చేపట్టారు.

విద్యార్ధులకు రూ.25,000 నగదు సహాకారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే హరీష్‌ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, MLC లు ఫారూఖ్ హుస్సేన్,రఘోత్తమ్ రెడ్డి,ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్,జిల్లా పరిషత్ ఛైర్మెన్ రోజాశర్మ,జేసీ పద్మాకర్, DEO రవికాంత రావు పలువురు హాజరయ్యారు.

- Advertisement -