మదన్ లాల్ ఖురానా మృతి పట్ల దత్తాత్రేయ సంతాపం

324
- Advertisement -

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా (82) శనివారం కన్నుమూశారు. అయన మృతి పట్ల బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మదన్ లాల్ ఖురానా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి, ఢిల్లీ ముఖ్య మంత్రిగా, అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రిగా మరియు రాజస్థాన్ గవర్నర్‌గా దేశానికి అనేక సేవలు అందించారని దత్తాత్రేయ తెలిపారు.

 Madan Lal Khurana

ఢిల్లీ మహా నగరాన్ని, తీర్చిదిద్దడంలో వారు ప్రముఖ పాత్ర పోషించారు. ఉత్తర భారత దేశంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణానికి అంకుఠిత దీక్షతో పనిచేసిన నాయకుడు మరణించడం పార్టీకి మరియు దేశానికే గాక ప్రత్యేకంగా జాతీయ వాదులకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అని అన్నారు.

- Advertisement -