మాపై దాడిని ఖండిస్తున్నాంః అటవీ శాఖ అధికారులు

323
Forest Officer Anitha
- Advertisement -

నిన్న సిర్పూర్ కాగజ్ నగర్ లో అటవీ శాఖ అధికారిణిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు అటవీ శాఖ ఉద్యోగుల సంఘం కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి. నిన్న జరిగిన ఘటనపై అటవీ శాఖ అధికారులు నేడు సెక్రటేరియట్ లో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా అటవీ శాఖ ఉద్యోగుల సంఘం కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేసి ఉరికే వదిలేయకుండా..కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అటవీ శాఖ ఉద్యోగులపై జరిగిన దాడులకు సంబంధించి ఫాస్ట్ ట్రక్ కోర్ట్ ఏర్పాటు చెయ్యాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నామన్నారు. మహిళ అధికారులకు మరింత భద్రత కావాలన్నారు. తెలంగాన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ అటవీ శాఖను మరింత అభివృద్ది చేశారన్నారు. మా అధికారిణిపై దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు..దీనిపై మేము డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

- Advertisement -