ఫ్లిప్ కార్డులో ఆకర్షనీయమైన ఆఫర్లు

360
- Advertisement -

దసరా పండుగ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్డ్ ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకోనుంది. “ధమాకా
సేల్” పేరుతో మరోసారి ఆఫర్ల సందడి చేయనుంది. ఫ్లిప్‌కార్డ్ “బిలియన్ డేస్” పేరిట నాలుగు రోజులపాటు
విక్రయాలు నిర్వహించి సరికొత్త రికార్డులను సృష్టించింది. అక్టోబర్ 24 నుంచి 27 వరకు ఈ సెల్
అందుబాటులోకి రానుంది. వచ్చే వారమే మరో సేల్ నిర్వహించాలని.. అన్ని ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్
ఇవ్వనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది.

మరోవైపు అమెజాన్ కూడా ఇప్పటికే వారం నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌ను వెల్లండించింది.
టెలివిజన్, గృహ ఉపయోగకరమైన వస్తువులపై 70 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈనెల 23 నుంచి
ఫ్లిప్‌కార్డ్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందు నుంచే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులకు
రాయితీ కల్పించేందుకు ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్ బ్యాంక్‌తో జత కట్టింది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు
వినియోగదారులు ఈ ఆఫర్ కింద డిస్కౌంట్ లేదా క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఎంపిక చేసిన డెబిట్ కార్డుల
మీద ఈఎంఐ సదుపాయన్ని ఇస్తున్నారు. ఇక ఈ ఫెస్టీవ్ సీజన్ సందర్బంగా వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై
భారీగా డిస్కౌంట్ ఇవ్వనుట్టు సంస్థ ప్రకటించింది.

అయితే క్యాష్ బ్యాక్ లేదా డిస్కౌంట్ ఎంతవరకు ఉంటందనే విషయం కస్టమర్లకు ప్రకటించలేదు. టీవీ, గృహ
ఉపయోగకమైన విభాగంలో 500 బ్రాండ్లు, 38,000 ఉత్పత్తులపై ఈ డిస్కౌంట్ ఉంటుంది. ఇక ఎలక్ర్లానిక్,
యాక్ససరీస్ విభాగంలోని మూడు కోట్ల ఉత్పత్తులపై 80 శాతం రాయితీ ప్రకటించింది.

- Advertisement -