సినిమావాళ్లు బరితెగించారని జయ బచ్చన్ ఆవేదన..

271
Online News Portal
Filmmaking has become a business
- Advertisement -

ఫిలిం మేకర్లు.. సినిమావాళ్లు బరితెగించారని బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్ సతీమణి జయ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్(మామి) 18వ సినీ ఉత్సవంలో భాగంగా దిగ్గజ దర్శకుడు బిమల్ రాయ్ సంస్మరణార్థం మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమలో జయ బచ్చన్ మాట్లాడారు. ఫిలిం మేకర్లు గతంలో కళాఖండాలను రూపొందించేవారని… కానీ, ఇప్పటి ఫిలిం మేకర్లకు అది పట్టడం లేదని, కేవలం నంబర్లు, బిజినెస్ మాత్రమే చూసుకుంటున్నారని జయ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు.

mitabh-bachchan-jaya-bachchan

ఈ తరం సినిమాలు చూడాలంటేనే భయమేస్తోందని.. మానవత్వం, సున్నితత్వం మచ్చుకైనా కనపడట్లేదన్నారు. తెరనిండా పాశ్చాత్య పోకడలు.. పొట్టపొట్టి దుస్తులే ఉన్నాయని.. ఇక పాత్రల్లో భారతీయత ఎక్కడుందని ప్రశ్నించారు. 50వ, 60 దశకాల్లో వచ్చిన సినిమాల్లో భారతీయ జీవం ఉట్టిపడేదని, రానురాను సినిమాల్లో పాశ్చాత్య అనుకరణ ఎక్కువైపోయిందని ఆమె అన్నారు. నేటితరం సినిమాల వల్ల జనం కూడా మారిపోతున్నారన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమావాళ్లు దారుణంగా బరితెగించారని… ఇపుడు ఫిలింమేకింగ్ పచ్చి బిజినెస్ అయిందని అన్నారు. మాట్లాడితే 100 కోట్ల కలెక్షన్లు, లేదంటే తొలివారం రికార్డులు. వన్నీ నాకు ఎప్పటికీ అర్థంకాని విషయాలు. అందుకే అలాంటి చోట నేను ఉండలేననని జయ బచ్చన్ అన్నారు.

Jaya-Bachchan-with-her-family

అయితే భారతీయుల ఆలోచనా విధానం ప్రగతిశీలంగానే ఉందని పేర్కొన్నారు. జనజీవితాలను ప్రతిబించించే కొన్ని సినిమాలు మాత్రం అద్భుతంగా అనిపిస్తాయని, మసాన్, అలీగఢ్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని, అలాంటివాటిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని జయ చెప్పారు. జనజీవితాలను ప్రతిబింబించే ఏ సినిమా అయినా అద్భుతంగా ఉంటుందని అన్నారు.

- Advertisement -