పిల్లి కోసం కొట్లాట…పీఎస్‌కు పంచాయతీ!

101
cat
- Advertisement -

కాస్త వింతగా ఉన్న ఇది నిజం. పిల్లి కోసం రెండు వర్గాలు కొట్టుకున్న షాకింగ్ సంఘటన సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఆ పిల్లి తమదంటే తమదంటూ ఘర్షణ పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే..హుజూర్‌నగర్ రామస్వామి గట్టు వద్ద నివాసముండే సుక్కమ్మ ఇటీవల జరిగిన గట్టు జాతరకు తన పిల్లితో కలిసి వెళ్లింది. అక్కడ పిల్లిని గమనించిన కొందరు అది తమ బంధువు ముత్యాలమ్మది అని వాగ్వాదానికి దిగారు. అయితే ఆ పిల్లి తనదేనని సుక్కమ్మ వాదించడంతో వారు ముత్యాలమ్మకు సమాచారం ఇచ్చారు. దీంతో ముత్యాలమ్మ తన బంధువులతో కలిసి సుక్కమ్మ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకోవడంతో వివాదం చెలరేగింది..

ఈ ఘటనపై ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పోలీస్ స్టేషన్ కు చేరిన పిల్లి పంచాయతీ స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -