డీఎస్పీ కొడుకు చనిపోయాడని పుకార్లు…ఒకరు అరెస్ట్

254
dsp son
- Advertisement -

కొత్తగూడెం డీఎస్పీ అలీ కుమారుడు చనిపోయాడని అబద్దాలు ప్రచారం చేస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలీ కొడుకు చనిపోయాడని ప్రచారం చేస్తున్న వంటమనిషిని వల వేసి పట్టుకున్నారు. తర్వాత తాను చనిపోలేదనే వీడియోని రిలీజ్ చేశాడు అలీ కుమారుడు. ప్రస్తుతం తాను గాంధీలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని…తనతో పాటు తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందన్నారు.

ఇక తెలంగాణలో పాజిటివ్ కేసుల సఖ్య 65కు చేరుకుంది. కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని…. ఇప్పటి దాకా విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా పాజిటివ్‌గా నిర్ఱారణ అయిందన్నారు. శనివారం కొత్తగా 6 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

కరోనాను కట్టడి చేసేందుకు సహకరించాలని… క్వారంటైన్‌ నుంచి తప్పించుకోవాలని చూడొద్దు అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 10 మంది కొలుకున్నారని వారిని నేడే రేపో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.

- Advertisement -