ఇవాళ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 889 పాయింట్లకు పైగా (1.19 శాతం) నష్టపోయి 73,759.94 వద్దకు చేరగా నిఫ్టీ 50 ఇండెక్స్ 239.1 పాయింట్లు (1.01 శాతం) పతనమై 23,244.45 వద్దకు పడిపోయింది. ప్రపంచ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారతీయ బెంచ్మార్క్ సూచీలు ప్రారంభ ట్రేడింగ్లోనే 1 శాతానికి పైగా కుప్పకూలాయి. నేడు స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో (డీప్ రెడ్) ట్రేడ్ అయింది.
ట్రేడింగ్ సమయంలో ఇండియా విక్స్ (India VIX) 8 శాతానికి పైగా పెరిగి 16.62కు చేరడంతో ఈ పతనం సంభవించింది. బుధవారం నాటి ట్రేడింగ్లో ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు కుప్పకూలడానికి దారితీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత పరిస్థితులు మార్కెట్ క్రాష్కు ప్రధాన ప్రమాదకరమైన అంశంగా మారాయి.
హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాలలో ఇరాన్ కార్యకలాపాలపై అమెరికా అధికారులు చేసిన తాజా వ్యాఖ్యలు ఇంధన భద్రత ఆందోళనలను మళ్లీ తెరపైకి తెచ్చాయి . అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో స్పష్టమైన పురోగతి లేకపోవడంతో ముడి చమురు ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ నేడు బ్యారెల్కు 97 డాలర్ల మార్కు వైపు దూసుకెళ్లింది. మన దేశీయ మార్కెట్లో MCX క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 1 శాతం పెరిగి బ్యారెల్కు రూ. 9,039 కి చేరింది.
Also Read:ఇది రాచరికం కాదు..రబ్రీపై సీఎం!
ఇటీవలి అస్థిరత తర్వాత, ట్రేడర్లు దూకుడుగా వ్యవహరించడం కంటే ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)… వృద్ధి అంచనాలు లేదా ద్రవ్యోల్బణ నియంత్రణపై ఆర్బీఐ ఇచ్చే ఎలాంటి సంకేతాలైనా స్వల్పకాలిక మార్కెట్ సెంటిమెంట్ను గణనీయంగా ప్రభావితం చేయవచ్చు అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

