ఈ సినిమాకు అధిక ప్రాధాన్యత ఇదే:ప్రభాస్

265
Saaho
- Advertisement -

బాహుబలి చిత్రం అనగానే మనకు గుర్తొచ్చేది ప్రభాస్. అద్బుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా సృష్టించి సంచలనం అంతా ఇంతా కాదు. ప్రముఖుల నుంచి ప్రసంశలే కాకుండా తాజాగా జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో సుజిత్‌(రన్‌ రాజా రన్‌ ఫేం) దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Excerpts from Sona: Prabhas

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అబుదాబిలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు బలమైన కథతో, కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్ కూడా తోడున్నాయి. ఈ సినిమా ఒక నవల తరహాలో కొనసాగే యాక్షన్ డ్రామా అని, ఎక్కడా కూడా రాజీ పడకుండగా ఈ సినిమా చిత్రీకరణ జరపుకుంటోంది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఖచ్చితంగా అందిస్తామని ప్రభాస్ తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రధ్దా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -